- హెల్త్ సరిట్ఫికెట్ తో ఖైదీలకు అడ్మిషన్
- కొత్తగా జైలుకు వచ్చే వారకి 14 రోజుల క్వారంటైన్
- గాంధీ ప్రిజనర్స్ వార్డులో 17 మంది రిమాండ్ ఖైదీలు
కరోనా సెకండ్ వేవ్తో జైళ్ల శాఖ అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలోని మూడు సెంట్రల్ జైళ్లు, అన్ని సబ్ జైళ్లలో కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటోంది. ఇప్పటికే కరోనా సోకిన 17 మంది ఖైదీలను గాంధీ హాస్పిటల్ ఐసోలేషన్లో అడ్మిట్ చేసింది. వెంటిలేషన్ అవసరం లేని వారిని కింగ్ కోఠి, టిమ్స్కి షిఫ్ట్ చేసింది. ఖైదీలు, అండర్ ట్రయల్ ప్రిజనర్స్కు హెల్త్ చెకప్ చేస్తోంది. ఖైదీకి మాస్కులు, శానిటైజర్తప్పనిసరి చేసింది.
జైలులో 14 రోజుల క్వారంటైన్
రాష్ట్రంలోని జైళ్లలో ప్రస్తుతం 7,000 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో విమెన్స్ జైళ్లలో 300 మంది ఉన్నారు. వీళ్లే కాకుండా ప్రతిరోజు సుమారు 10 నుంచి 15 మంది నిందితులను పోలీసులు రిమాండ్ చేస్తున్నారు. వీరికి కరోనా టెస్టులు తప్పనిసరి చేశారు. రిమాండ్ ప్రిజనర్స్కు స్పెషల్ బ్యారక్ ఏర్పాటు చేశారు. వీరికి14 రోజుల త్వరాత కరోనా టెస్ట్లు నిర్వహిస్తున్నారు. నెగెటివ్ వచ్చిన వారినే అధికారులు ఇతర బ్యారక్స్లోకి పంపిస్తున్నారు.
ర్యాక్స్ పెంచారు
చంచల్గూడ జైల్లో12 బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కో బ్లాక్లో బ్యారక్స్ ఏర్పాటు చేసి ఇదివరకు సుమారు 300 మంది ఖైదీలను ఉంచేవారు. అయితే కరోనాతో ఫిజికల్ డిస్టెన్స్మస్ట్ కావడంతో అందుకు అనుగుణంగా మరో 4 కొత్త బ్లాకులను ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం చంచల్గూడలో16 బ్లాక్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక్కో బ్యారక్లో ప్రస్తుతం 70 నుంచి 80 మందిని రెండు మీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు కొత్తగా అడ్మిషన్ తీసుకుంటున్న రిమాండ్ ఖైదీలతో పాటు నిందితుల ఎస్కార్ట్కి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. నిందితులకు థర్మల్ స్కానింగ్తో టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. చంచల్ గూడ,చర్లపల్లి జైలులోని హాస్పిటల్స్లో నలుగురు డాక్టర్లు హెల్త్ చెకప్ చేసి ఎప్పటికప్పుడు ఖైదీల హెల్త్ కండీషన్ తెలుసుకుంటున్నారు. డిస్పెన్సరీలో కరోనా మందులను అందుబాటులో ఉంచారు. ఫిజికల్ డిస్టెన్స్, మాస్కులు, గ్లౌజెస్,శానిటైజేషన్పై చర్యలు తీసుకున్నారు.